ప్రముఖ గాయకుడు, వైఎస్సాఆర్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న (Apoori Somanna) బీఆర్ఎస్ లో (BRS Party) చేరనున్నారు. ఈరోజు మంత్రి కేటీఆర్ తో సోమన్న సమావేశమయ్యారు. బీఆర్ఎస్ లో చేరాలన్న నిర్ణయాన్ని కేటీఆర్ కు సోమన్న స్వయంగా తెలిపినట్లు సమాచారం. సోమన్న నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కవి, గాయకుడు అయిన ఏపూరి సోమన్న తొలుత అరుణోదయ సంస్థలో పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సోమన్న.. తన ఆటాపాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కార్ సోమన్నకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగం కల్పించింది. అయితే.. కొన్నాళ్లకే సోమన్న ఆ ఉద్యోగాన్ని వదిలి కేసీఆర్ సర్కార్ విధానాలపై తన పాటల ద్వారా పోరాటం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన సోమన్న మూడేళ్ల క్రితం షర్మిల సారథ్యంలోని వైఎస్సాఆర్టీపీలో చేరారు.
పూర్తిగా చదవండి..Apoori Somanna: వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి ఏపూరి సోమన్న..
ప్రముఖ తెలంగాణ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన మంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ నేతలు బల్కా సుమన్, దేశపతి శ్రీనివాస్ తో కలిసి చర్చలు జరిపారు.

Translate this News:











