సాధారణంగా ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పిల్లల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. అయితే కులాంతర వివాహానికి మాత్రం మొగ్గు చూపించరు. టెక్నాలజీ కాలంలో కూడా పాత సంప్రదాయాలు పాటిస్తూ పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక తమకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటే వారిని చంపడమో, వెలివేయడమో సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం తన కూతురికి కులాంతర వివాహాం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవి ఇష్టప్రకారం ప్రియుడితో పెళ్లి జరిపించారు. ముందుగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో దైవ శాస్త్ర ప్రకారం తాళి కట్టించి పెళ్లి చేశారు. అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లి వారి పెళ్లిని రిజిస్టర్ చేయించారు. అనంతరం వారికి వివాహ పత్రాన్ని కూడా అందించారు.
పూర్తిగా చదవండి..Rachamallu: కూతురికి దగ్గరుండి కులాంతర వివాహం జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే
సాధారణంగా ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పిల్లల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. అయితే కులాంతర వివాహానికి మాత్రం మొగ్గు చూపించరు. టెక్నాలజీ కాలంలో కూడా పాత సంప్రదాయాలు పాటిస్తూ పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక తమకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటే వారిని చంపడమో, వెలివేయడమో సాధారణంగా చూస్తూ ఉంటాం.

Translate this News:











