Bandi Sanjay Kumar Karimnagar MLA: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ(BJP) కొత్త వ్యూహం రచిస్తోందా? బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే ఆలోచనలో ఉందా? రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీల ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా వ్యూహం పన్నుతోందా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణలో ఎన్నికలకు ముందే.. బీసీ సీఎం అని ప్రకటించేలా ప్లాన్ సిద్ధం చేసిందట బీజేపీ. ఈ ప్లాన్ ప్రకారం.. సీఎం రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్ ఉన్నారని టాక్. ఇటీవలి కాలంలో పార్టీలో ఈటల రాజేందర్(Etela Rajender) బాగా యాక్టీవ్ అయ్యారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటిలో ఆయన ముందుంటున్నారు. అయితే, అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందనే మాత్రం సస్పెన్స్గా మారింది.
పూర్తిగా చదవండి..Telangana BJP: బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా? తెలంగాణలో బీజేపీ నయా స్ట్రాటజీ..
బండి సంజయ్కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించింది. దాని ఫలితంగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా బండి నిలబడతారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ను ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. దాంతో ఆయన ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది.

Translate this News:












