దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న G20 శిఖరాగ్ర సమావేశంలో భారతదేశ వారసత్వపు అద్వితీయ సంగమం కనిపిస్తుంది. అంతకుముందు, ప్రధాని మోదీ భారత్ మండపం వద్ద అతిథులను స్వాగతిస్తున్నప్పుడు, మోదీ వెనుక కోణార్క్ సూర్య దేవాలయ చక్రం యొక్క ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దాని గురించి ప్రధాని మోదీ స్వయంగా అతిథులకు చెప్పారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్తో సహా కొంతమంది G20 నాయకులకు నలంద విశ్వవిద్యాలయం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని వివరిస్తూ కనిపించారు.
పూర్తిగా చదవండి..G20 Summit: G20లో స్పెషల్ అట్రాక్షన్గా వాల్ పోస్టర్..ఇందులో ప్రత్యేకత ఏంటంటే..!!
జీ20 ముగింపు విందుకు దేశాధినేతలను ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. అయితే వారిని ఆహ్వానిస్తున్నప్పుడు వారి వెనకున్న ఒక వాల్ పోస్టర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ముర్ము, ప్రధాని మోదీ జీ20 ప్రతినిధులను శనివారం ఏర్పాటు చేసిన ఉత్సవ విందులో స్వాగతించే సమయంలో పోస్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Translate this News:











