తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీకి భారీగా వసూళ్లు వచ్చాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగొచ్చే వారి సౌకర్యం కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను కేటాయించింది. దీంతో ఆర్టీసీకి దాదాపు 25 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రణాళికబద్ధంగా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు నడిపించడం వల్ల ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. తెలంగాణకు మాత్రమే కాదు అటూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఈ ఏడాది టీఎస్ఆర్టీసీ ఏకంగా 5,500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం విశేషం. ప్రయాణికుల కోసం హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టేషన్లైన ఎంజీబీఎస్, జేబీఎస్లతో సహా సీబీఎస్, దిల్షుక్నగర్, లింగంపల్లి, కేపీహెచ్బీ, అమీర్పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్రోడ్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ.. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరా ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది.
పూర్తిగా చదవండి..TSRTC: దసరా పండుగ ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకీ కాసుల వర్షం..
తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థకు భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు నడిపించడం వల్ల ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 13 నుంచి 24 వరకు దాదాపు 11 రోజుల పాటు 5,500 ప్రత్యేక బస్సులు నడిపించడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది.

Translate this News:











