మరికొన్ని గంటల్లో అదృష్ట దేవత ఎవరిని వరించనుందో తేలిపోనుంది. తెలంగాణలో లిక్కర్ షాపుల టెండర్ల కేటాయింపును లక్కీ డ్రా ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాటు పూర్తిచేసింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2023-25 మద్య పాలసీకి సంబంధించి కొత్త షాపుల ఏర్పాటకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ఆసగ్టు 18తో ముగిసింది. ఎన్నడూ లేని రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..లక్కున్నోళ్లకే లిక్కర్ లైసెన్సులు.. లక్కీ డ్రాకు అంతా రెడీ
తెలంగాణలో లిక్కర్ షాపుల టెండర్లకు వేళైంది. సోమవారం లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులు కేటాయించనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అంతా రెడీ చేసింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Translate this News:











