మొత్తం 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ (Congress party) నిన్న ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. టికెట్ దక్కని కారణంతో పలు చోట్ల నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టికెట్ దక్కదన్న భావనతో ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) పార్టీని వీడి ఈ రోజు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మరో నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా బీఆర్ఎస్ గూటికి చేరడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా మరో సీనియర్ నేత పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy) పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Neelam Madhu: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. నీలం మధు రాజీనామా
TS Congress: కాంగ్రెస్లో మరో వికెట్.. నాగం గుడ్బై?
నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు.

Translate this News:











