ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం 14 మంది మృతిచెందగా, 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. రాత్రి 7 గంటల 10 నిమిషాలకు విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. మొదట పట్టాలు తప్పిన రైలును మరో రైలు ఢీకొట్టినట్లు అధికారులు భావించారు. కానీ సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాసకు వెళ్తున్న రైలును విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Train Accident:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటలకు ట్రాక్ మీద ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.

Translate this News:











