వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. సిలిండర్ ధర భారీగా పెరిగింది. అక్టోబర్ 1వ తేదీ ఈ పెరిగిన ధరలతో ప్రజలకు ఝలక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా రూ.209పెంచుతున్నట్లు ప్రకటించాయి. రేట్ల పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పెంచిన ధరలు వర్తిస్తాయి. అయితే ఈ సిలిండర్ ధర పెంపు నిర్ణయం కొందరికి మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఈ సిండర్ ధరను రూ. 209కి పెంచాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Gas Price Hike: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.209 పెంచాయి. ఈ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో, న్యూఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1731.50 అవుతుంది. నెల రోజుల క్రితమే, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను రూ.158 తగ్గించాయి. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది. పండగల ముందు సిలిండర్ ధరలను పెంచి వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు.

Translate this News:











