చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై న్యూస్ క్లిక్ అనే మీడియా సంస్థ కార్యాలయాలు, ఉద్యోగులు, జర్నలిస్టుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లతో పెద్దెత్తున ఈ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లతోపాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు ఆధారాల సేకరణ కోసం స్వాధీనం చేసుకున్నారు. యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. హార్డ్ డిస్క్ డేటాను కూడా పోలీసులు తీసుకున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..News Click : న్యూస్క్లిక్తో చైనా లింకులు.. జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు.. అసలేం జరుగుతోంది?
న్యూస్ క్లిక్ (న్యూస్క్లిక్ జర్నలిస్ట్పై దాడి) నిధులకు సంబంధించి ED ఇప్పటికే దాడులు నిర్వహించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ, న్యూస్ క్లిక్లోని కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. న్యూస్ క్లిక్ అనేది మీడియా ఫ్లాట్ ఫామ్. దీన్ని 2009లో సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన ప్రబీర్ పుర్కాయస్త స్థాపించారు. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ ను కవర్ చేస్తుంది.

Translate this News:











