రాజ్యసభలో మహిళా బిల్లు చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. ఉదయం 11 గంటలకు మొదలైన చర్చ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతంది. ప్రస్తుతం దీని మీద మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాట్లాడుతున్నారు. ఇందులో మొట్టమొదటగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు బిల్లు అమలులో కేంద్రం అంచనా తప్పుగా వేసిందన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్, ప్రజాభిప్రాయ సేకరణ ఇవన్నీ పూర్తి కావాలంటే 2030 వరకు పడుతుంది. అంటే.. 2029మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అసాధ్యం. అంతలేటు చేసేకన్నా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ చేస్తే బిల్లు వెంటనే అమలు చేసే ఆస్కారం ఉంటుందని కేశవరావు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాతే జనాభా లెక్కలు అనడం అర్థరహితం అని ఆయన విమర్శించారు.
పూర్తిగా చదవండి..telugu MP’s:మహిళా బిల్లుపై తెలుగు రాష్ట్రాలు ఎంపీలు ఏమన్నారంటే…
నాల్గవ రోజు పార్లమెంట్ సెషన్స్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ జరుగుతోంది. దీని మీద తెలుగు ఎంపీలు మాట్లాడారు. బిల్లుకు అందరూ మద్దుతునివ్వడంతో పాటూ దాని మీద తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

Translate this News:















