తెలంగాణలో మరో సారి గ్రూప్-1 పరీక్ష రద్దైంది. జూన్ 11 న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. పరీక్ష సందర్భంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయకపోవడంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పేపర్ లీకేజీ కారణంగా ఇప్పటికే పరీక్ష ను ఓసారి రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. రద్దు చేసిన పరీక్షను జూన్ 11న నిర్వహించింది. తాజాగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని పలువురు అభ్యర్థులు ఆశ్రయించడంతో హైకోర్టు మరో సారి పరీక్షను రద్దు చేసింది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేని నిరుద్యోగుల్లో ఉత్కంఠగా మారింది. కోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తుందా.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా అన్న అంశం మరో ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది.
పూర్తిగా చదవండి..Big Breaking: తెలంగాణలో మరో సారి గ్రూప్-1 రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో మరో సారి గ్రూప్-1 పరీక్ష రద్దైంది. జూన్ 11 న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Translate this News:











