తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్కు చేరుకుంది. నేతల మధ్య మాటల యుద్ధం నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ బడా లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనులే మాటల మంటలు రేపుతున్నాయి. ఐటీమంత్రి కేటీఆర్ వర్సెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మధ్య వార్ కంటీన్యూ అవుతోంది. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ హీట్ పెంచుతున్నారు. డైలాగులు పేల్చుతూ ప్రజలకు అసలుసిసలైన ఎలక్షన్ మజాను పంచుతున్నారు. తాజాగా మరోసారి ట్వి్ట్టర్ వేదికగా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. కొత్త ప్రభావర్పై దాడి విషయంలో మంత్రి కేటీఆర్ ట్వీట్కు బదులుగా రేవంత్రెడ్డి ఘాటైన ట్వీట్ వేశారు.
పూర్తిగా చదవండి..KTR vs Revanth: ‘డ్రామారావు.. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార’.. మొండి కత్తి డ్రామా!
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన కత్తి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని.. ఓ నేరస్థుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారంటూ కేటీఆర్ వేసిన ట్వీట్పై రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు.

Translate this News:











