నవంబర్ 30న జరగనున్న తెలంగాణ ఎన్నికలకు (TS Elections 2023) సంబంధించి మిషన్ చాణక్య (Mission Chanakya) సంస్థ ఈ రోజు తమ సర్వే ఫలితాలను విడుదల చేసింది. 44.62 శాతం ఓట్లతో మరో సారి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారంలోకి రానున్నట్లు తన సర్వే ఫలితాల్లో పేర్కొంది మిషన్ చాణక్య. కాంగ్రెస్ పార్టీ 32.71 శాతం, బీజేపీ 17.6 శాతం ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఇతరులకు 5.07 శాతం ఓట్లు వస్తయని తమ సర్వేలో వెల్లడైందని మిషన్ చాణక్య అధినేత శివకేశవ్ తెలిపారు. ఇంకా సీట్ల లెక్కల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ పార్టీ 70-76 సీట్లను గెలుచుకుంటుందని మిషన్ చాణక్య అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బీసీ జపం.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?!
TS Elections 2023: తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. మిషన్ చాణక్య సంచలన సర్వే.. వివరాలివే!
రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 70-76 సీట్లు సాధించి మరోసారి అధికారం దక్కించుకుంటుందని మిషన్ చాణక్య సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 25, బీజేపీ 9 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Translate this News:












