తెలంగాణ కాంగ్రెస్ కు (Telangana Congress) కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తమను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ బీసీ నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సరైన సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వకుంటే ఏం చేద్దాం అని బీసీ నాయకుల అంతర్మధనం పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కమ్మ నాయకులకు, రేణుకా చౌదరికి రాహుల్, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చి తమకు ఇవ్వకపోవడంపై వారు రగిలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీలను రెడ్డీలే అడ్డుకుంటున్నారని బీసీ నాయకుల అంతర్గతంగా చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీకి (Rahul Gandhi) అత్యంత సన్నిహితుగా పేరున్న మధుయాష్కీ గౌడ్ కే (Madhu Yashki Goud) టికెట్ రాకుండా కుట్ర జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. బీసీలకు టిక్కెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే అని బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ నాయకుల విషయంపై ఎలా స్పందిస్తుంది.. వారిని ఎలా సంతృప్తి పరుస్తుందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Telangana BJP: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్: మురళీధర్ రావు
Telangana Congress: టిక్కెట్లు ఇవ్వకుంటే ఏం చేద్దాం?.. భగ్గుమంటున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు
కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సరైన సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వకుంటే ఏం చేద్దాం అని బీసీ నాయకుల అంతర్మధనం పడుతున్నట్లు సమాచారం.

Translate this News:











