తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. బీసీ, మహిళా నేతలు తమ వారికి భారీగా టికెట్లను కేటాయించాలని ఆందోళన చేస్తుండగా.. తాజాగా ఆదివాసీలు సైతం ఆందోళనకు దిగారు. ఈ రోజు గాంధీభవన్ వద్ద ఆదివాసీలు మెరుపు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆసిఫాబాద్ నుండి గాంధీభవన్ కు ఆదివాసీలు భారీగా చేరుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం డప్పులు, కొమ్ములు, డోలుతో స్లొగన్స్ చేస్తూ గాంధీభవన్ మెట్లమీద ధర్నా చేశారు. ఆసిఫాబాద్ టికెట్ ఆదివాసీలకు ఇవ్వాలని వాడు డిమాండ్ చేశారు. ఆదివాసీ బిడ్డ మరసుకొల్ల సరస్వతి కి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాల్సిందేన్నారు. అసిఫాబాద్ జనాభాలో లక్ష మంది మంది ఆదివాసీలు ఉన్నారన్నారు. ఆసిఫాబాద్ జనాభాలో లంబాడాలు 17 వేల మంది కూడా లేరన్నారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో ఆసిఫాబాద్ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి: TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్…రంగంలోకి కేసీఆర్
Telangana Congress: కాంగ్రెస్ లో తారా స్థాయికి టికెట్ల పంచాయితీ.. గాంధీభవన్ వద్ద ఆదివాసీల మెరుపు ధర్నా!
ఈ రోజు గాంధీభవన్ వద్ద ఆదివాసీలు మెరుపు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అసిఫాబాద్ నుండి గాంధీభవన్ కు ఆదివాసీలు భారీగా చేరుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం డప్పులు, కొమ్ములు, డోలుతో స్లొగన్స్ ఇస్తూ గాంధీభవన్ మెట్లమీద ధర్నా చేశారు.

Translate this News:











