తెలంగాణ బీజీపీకి (Telangana BJP) భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు పార్టీని వీడితే అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని నాయకత్వంలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సాయంత్రం జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు టచ్ లో ఎంత మంది ఉన్నారన్న అంశంపై పార్టీ ముఖ్యనాయకులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Telangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
Telangana BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే?
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించానికి సిద్ధమవుతున్న బీజేపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ బాపురావు, వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతల రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సాయంత్రం జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు.

Translate this News:











