
తెలంగాణ(telangana)లో హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతుల పాఠశాలల వేళలను విద్యా శాఖ మార్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు విద్యాశాఖ పంపించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు(primary schools) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమై. సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలల సమయాల్లో ఎలాంటి మార్పులు చేయని విద్యాశాఖ.. కేవలం ప్రాథమిక పాఠశాలల సమయాల్లోనే మార్పులు చేసింది.
పూర్తిగా చదవండి..











