టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. స్కిల్ డవలప్మెంట్ కేసు, చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest), క్వాష్ పిటిషన్ కొట్టివేత, సీఐడీ విచారణ తదితర అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను (Yuvagalam Padayathra) మళ్లీ ప్రారంభించే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయిందని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. వచ్చే వారంలో తన యువగళం యాత్రను మళ్లీ ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా లోకేష్ ముఖ్య నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. మళ్లీ అక్కడి నుంచే తన పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలస్తోంది. పాదయాత్రతో పాటు చంద్రబాబుపై కేసుల విషయంలో న్యాయ పోరాటం కొనసాగించాలని లోకేష్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు సీఐడీ కేసు అంశంపై ఆయన లాయర్లతో చర్చలు జరుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh Yuvagalam: యువగళం యాత్రపై నారా లోకేష్ సంచలన నిర్ణయం.. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Translate this News:











