నంద్యాలలో ఈ రోజు నిర్వహించిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (TDP PAC) మీటింగ్ ముగిసింది. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మీడియాతో మాట్లాడారు. మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అరెస్టును (Chandrababu Arrest) నిరసిస్తూ అక్టోబర్ 2వ తేదీన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని ప్రకటించారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతాయన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి పోరాడుతాన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. మేలుకో తెలుగోడా అనే నినాదంతో ముందుకు వెళ్తామని ఆయన ప్రకటించారు. జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయన్నారు. పవన్ కల్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. యాత్రలో తెలుగు దేశం కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా పాల్గొంటారని ప్రకటించారు బాలకృష్ణ.
ఇది కూడా చదవండి: Big Breaking: యనమలకు టీడీపీ పగ్గాలు.. చంద్రబాబు కీలక నిర్ణయం?
Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్ 2వ తేదీన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని బాలకృష్ణ ప్రకటించారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతాయన్నారు.

Translate this News:











