సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. స్టాలిన్ మాటలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా చాలా మంది మండిపడ్డారు. చివరకు ఇవి సుప్రీంకోర్టు వరకూ వెళ్ళాయి. ఉదయనిధి మీద చర్యలు తీసుకోవాలంటూ అత్యున్నత న్యాస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. దీన్ని విచారణ చేసిన కోర్టు ఈ రోజు తమిళనాడు మంత్రికి నోటీసులను జారీ చేసింది.ఉదయనిధితో పాటూ ఏ.రాజా, మరో 14 మందికి ఈ నోటీసులను పంపింది. ఇందులో సీబీఐ అధికారులతో పాటూ తమిళనాడు పోలీసులు కూడా ఉన్నారు.
పూర్తిగా చదవండి..సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు…సుప్రీంకోర్టు నోటీసులు
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాని మీద విచారణ చేసిన కోర్టు ఉదయనిధికి నోటీసులను జారీ చేసింది.

Translate this News:











