మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ (brs) పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 27న (రేపు) పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (cm kcr) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కూసుమంచి (kusmachi) మండలంలోని జీళ్లచెరువు (Jillacheruvu) గ్రామంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి (Paleru MLA Kandala Upender Reddy) సభ ప్రాంగణాన్ని, పార్కింగ్ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద సభకు వచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పాలేరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధుల బృందం, కార్యకర్తలు భారీ ఎత్తున ప్రజా ఆశీర్వాద సభకు (Praja asirvada meeting) తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Election: రేపు పాలేరుకు సీఎం కేసీఆర్.. పొంగులేటిపై పంచ్లు ఉంటాయా..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేయబోతోంది. రేపు (శుక్రవారం) పాలేరు నియోజకవర్గంలోని జీళ్లచెర్వు గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభతో ప్రచార భేరిని ప్రారంభించనుంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండటంతో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

Translate this News:












