మహబూబ్నగర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జడ్చర్లలో విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సుబోల్తా పడింది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయాలయ్యాయి. మౌంట్ బాసిల్ స్కూల్కు చెందిన బస్సు జడ్చర్ల-మహబూబ్నగర్ మార్గంలో కొత్తతండా దగ్గర అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులతో సహాయకచర్యలు చేపట్టారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులను మొదటగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించి.. అనంతరం SVS ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆందోళనతో ఆస్పత్రి వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. కొంతమంది స్కూల్ దగ్గర నుంచి విద్యార్థులందరిని ఇంటికి తీసుకెళ్తున్నారు.
పూర్తిగా చదవండి..School Bus: తెలంగాణలో స్కూల్బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..?
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. పిల్లలకు ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా ఆస్పత్రి దగ్గర చేరుకున్నారు.

Translate this News:











