సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చేతులతో మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం భారీగా పరిహాం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ అనేక మంది చనిపోతున్నారని.. అలాగే కొంతమంది వైకల్యానికి కూడా గుర్యయారంటూ ఇటీవల సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ పిల్ను జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ అర్వింద్ కుమార్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాన్యువల్ స్కావెంజింగ్ను సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవవాలని ధర్మాసం సూచించింది. చేతులతో మురుగు కాలువలను శుభ్రం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. మాన్యువల్ స్కావెంజర్గా పని చేస్తూ శాశ్వత వైకల్యానికి గురైన బాధితులకు రూ.20లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచనలు చేసింది.
పూర్తిగా చదవండి..Supreme Court: వారికి పరిహారం రూ.30 లక్షలు చెల్లించాల్సిందే.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతి చెందింతే వారి కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాన్యువల్ స్కావెంజర్గా పని చేస్తూ శాశ్వత వైకల్యానికి గురైన బాధితులకు రూ.20లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచనలు చేసింది. అలాగే ఇతర రకాల వైకల్యానికి గురైన వారికి రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని పేర్కొంది. ఈ వృత్తిలో కొనసాగేవారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Translate this News:











