ఘోర రోడ్డు ప్రమాదం, మృతిచెందిన కారు డ్రైవర్
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని బైపాస్ రోడ్డు హైవేపై బుధవారం ఉదయం కారు పల్టీ కొట్టింది. ఈ ఘటన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంన్కెపల్లి చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. దీంతో పాటుగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పిడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.












