ఆంధ్రప్రదేశ్లో పుంగనూరు రాజకీయ వేడి కొనసాగతూనే ఉంది. తాజాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పుంగనూరుకు రాకుండా లారీని అడ్డం పెట్టింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆ లారీని పక్కకు తీస్తున్న టీడీపీ నేతలపై లాఠీచార్జి చేసిన పోలీసులు.. లారీని రోడ్డుకు అడ్డంపెట్టిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిని అడ్డుకుంటుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పని చేశారని బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు దాడి ఘటనపై జిల్లా ఎస్పీ వైసీపీ నాయకుడిలా మాట్లాడారన్న టీడీపీ నేత.. తమ అధినేతపై దాడి చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది..
రాష్ట్రంలో పుంగనూరు రాజకీయ వేడి కొనసాగతూనే ఉంది. తాజాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పోలీసుల వల్లే పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొందన్నారు. రోడ్డుకు లారీని అడ్డుగా పెట్టిన వారిపై పోలీసులు కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. లారీని తీయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు.

Translate this News:











