ఇటీవల బీఆర్ఎస్ ను (BRS Party) వీడి తమ పార్టీలో చేరిన సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageshwar Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం (Palair Assembly constituency) నుంచే పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి వర్గీయులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరుతోనే తన రాజకీయం ముడిపడుందంటూ స్పష్టం చేస్తున్నారు. పాలేరుకు గోదావరి జలాలు పారించడమే తన లక్ష్యమని ఆయన ప్రకటిస్తున్నారు. దీంతో పొంగులేటి, తుమ్మల అభ్యర్థిత్వం ఖరారు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఇది కూడా చదవండి: Big Breaking: తెలంగాణ ఎన్నికల బరిలో షర్మిల, విజయమ్మ.. ఇతర అభ్యర్థుల లిస్ట్ ఇదే!
Khammam Politics: పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్.. ఖమ్మం జిల్లా పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్!
తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాలేరు, ఖమ్మంలో ఎవరు పోటీ చేస్తారో మీరే తేల్చుకోండని హైకమాండ్ వీరికి చెప్పినట్లు సమాచారం. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తుమ్మలతో సమావేశమయ్యారు.

Translate this News:











