మహా రాజకీయ పరిణామాలు బిహార్లో గుబులు రేపుతున్నాయి. ముందు శివసేన, తర్వాత ఎన్సీపీలో చీలికలు, తర్వాత బిహార అధికార పార్టీ జేడియూనే టార్గెట్ అనే మాటలు…బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లోనూ దడ పుట్టిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఎన్డీఏలోకి వెళ్లి…బయటకు వచ్చిన అనుభవం నితిష్ ఉంది.
పూర్తిగా చదవండి..త్వరలోనే జేడియూ విచ్చిన్నం?…ఎన్డీఏ వైపు నితిన్ అడుగులు..!!
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక తర్వాత రాజకీయ పండితులంతా ఇప్పుడు బీహార్ పైనే కన్నేశారు. త్వరలో జేడీయూలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ చీలిపోవచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే నితీష్ రాజకీయ జీవితం శరవేగంగా ముగింపు దిశగా సాగడం ఖాయం అని భావించవచ్చు. బహుశా పరిస్థితి తీవ్రతను చూసి నితీష్ కుమార్ హఠాత్తుగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతున్నారు. అదే సమయంలో జేడీయూలో త్వరలో పెద్ద బ్రేక్ పడబోతోందన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అందుకే పార్టీని కాపాడుకోవడమే మంచిదన్న ఆలోచనతో నితిశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Translate this News:












