ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు (NIA Raids) కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతితో పాటు శ్రీకాకుళం, అనంతపురం, విజయవాడలో సోదాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ప్రముఖ న్యాయవాది క్రాంతి చైతన్య ఇంట్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. క్రాంతి చైతన్య మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. క్రాంతి చైతన్యకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు వున్నట్లు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనూ ఎన్ఐఏ దాడుల చేస్తోంది. పట్టణంలోని ముచ్చవానిపేటలో నివాసం వుంటున్న మస్కా క్రిష్ణయ్య ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. కృష్ణయ్య ప్రస్తుతం కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..NIA Rides: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం.. కారణమిదేనా?
ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు (NIA Raids) కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లోని పలువరు పౌరహక్కుల నేతల నివాసాల్లో ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

Translate this News:











