ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో (telangana politics) రోజుకో ఊహించని పరిణామం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో ఎత్తు అన్నట్లుగా ఉంది పరిస్థితి. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ట్విస్ట్ ఇచ్చారు మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు (Jalagama Venkat Rao). ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన డిసైడ్ సమాచారం. 2014 ఎన్నికల్లో ఆయన కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. కొన్ని రోజులకు వనమా బీఆర్ఎస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు వెంకట్రావు దూరంగా ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: TS Congress: కాంగ్రెస్లో మరో వికెట్.. నాగం గుడ్బై?
Khammam Politics: ఖమ్మం పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్.. రంగంలోకి మాజీ సీఎం కుమారుడు.. ఇండిపెండెంట్ గా బరిలోకి..
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సీపీఐకి ఇస్తే కాంగ్రెస్ కేడర్ తన వెంటే ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Translate this News:











