తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అన్నవరం వెళ్లే భక్తులకు కొత్త రూల్స్ జారీ చేసింది దేవాదాయ శాఖ. ఇకపై సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు కొత్త కండీషన్లు అప్లై చేసింది. వసతులపై దేవాదాయ శాఖ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. భక్తులు వసతి గదిని తీసుకోవడానికి ఆధార్ కార్డును ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.
పూర్తిగా చదవండి..అన్నవరం వెళ్లే భక్తులకు గమనిక.. ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే!!
అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒక్కసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త సాఫ్ట్ వేర్ ను కూడా అప్ డేట్ చేయించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా భక్తులు వసతి గది తీసుకునే విషయంలో పలు కండీషన్లు తీసుకొచ్చింది. భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) తీసుకోవడం తప్పనిసరి చేసింది..

Translate this News:











