అగ్రనేతలు పార్టీని వీడుతున్న వేళ.. తెలంగాణ బీజేపీలో (Telangana BJP) కొత్త పంచాయితీ మొదలైంది. సీట్ల కేటాయింపుపై ముఖ్య నేతల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ టికెట్ ను తన కుమారుడికి కేటాయించాలని మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పార్టీని కోరుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్ తో ఆయన భేటీ అయ్యారు. వేములవాడ అసెంబ్లీ సీటును తన తనయుడు వికాస్ రావుకు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ (Eatala Rajendar) మాత్రం మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమకు అక్కడి నుంచి టికెట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: TS Politics 2023: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి డీకే అరుణ, విజయశాంతి?
TS BJP: తెలంగాణ బీజేపీలో కొత్త చిచ్చు.. ఈటల సీరియస్, కొండా అలక.. అసలేమైందంటే?
తెలంగాణ బీజేపీలో వేములవాడ, రాజేంద్రనగర్ టికెట్ల విషయంలో ముఖ్య నేతల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వేములవాడ టికెట్ ను తుల ఉమకు ఇవ్వాలని ఈటల పట్టుబడుతుండగా.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తన కుమారుడికి ఇవ్వాలని ముఖ్య నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఒక్క సీటును కూడా రెడ్లకు ఇవ్వకపోవడంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అలకవహించినట్లు సమాచారం.

Translate this News:











