ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ (Nara Lokesh) సీఐడీ విచారణ ముగిసింది. రేపు మరోసారి విచారణకు రావాలని లోకేష్ కు సీఐడీ అధికారులు (AP CID) నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన రేపు మళ్లీ అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు రానున్నారు. విచారణ అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. తనకు ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధం లేని 49 ప్రశ్నలు అడిగారన్నారు. 50వ ప్రశ్నగా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన మీ మంత్రి వర్గం ముందుకు వచ్చిందా? అని అడిగారన్నారు. తనను మొత్తం 50 ప్రశ్నలు అడిగారని లోకేష్ చెప్పారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో తాను కానీ, తన కుటుంబం కానీ ఎలా లబ్ధి పొందుతాం అని ప్రశ్నించారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రస్థావనే తన దగ్గరకు రాలేదన్నారు. ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే సీఐడీ కాలయాపన చేస్తోదని ఆరోపించారు. ఇంకా ప్రశ్నలున్నాయి.. మీరు రేపు మరోసారి రండి అని దర్యాప్తు అధికారులు కోరారన్నారు.
ఇది కూడా చదవండి: స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మరో షాక్
Nara Lokesh CID: రేపు మరోసారి సీఐడీ విచారణకు నారా లోకేష్.. విచారణ తర్వాత సంచలన ప్రెస్మీట్
ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు ఆయన విచారణ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే.. రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీంతో రేపు మరో సారి సీఐడీ విచారణకు హాజరుకానున్నారు.

Translate this News:











