ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (IICC) ఢిల్లీలోని ద్వారకలో అత్యాధిక హంగులతో నిర్మించారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్కు ‘యశోభూమి’ అని పేరు పెట్టారు. వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యశోభూమిలో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఇక్కడ కూర్చోవచ్చు. పలు నివేదికల ప్రకారం.. ఈ కొత్త కన్వెన్షన్ సెంటర్ ప్రగతి మైదాన్లో ఇటీవల చర్చించిన భారత్ మండపం కంటే చాలా పెద్దది. వేలాది కార్ల పార్కింగ్, అనేక సమావేశ మందిరాలు, మొదలైన అనేక సౌకర్యాలు ఉన్నాయి, దీని కారణంగా ఇది దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ నిలవనుంది.
పూర్తిగా చదవండి..PM Modi : యశోభూమి కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించనున్న మోదీ…IICC ప్రత్యేకత ఏంటి?
నేడు భారత ప్రధాని నరేంద్రమోదీ 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు, కేంద్రమంత్రులు, ఎంపీలు, సీఎంలు, ఎమ్మెల్యేలు, మోదీ అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మోదీ పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. లేటెస్టు టెక్నాలజీ యశోభూమి పేరుతో నిర్మించిన ఇండియన్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచే విశ్వకర్మ పథకాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు.

Translate this News:











