నాలుగు నెలలుగా మణిపూర్ రాష్ట్రం అట్టుకుడుతోంది. కుకీ, మైతీ కమ్యునిటీల మధ్య మొదలైన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. వందల ప్రాణానలు పొట్టనపెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం నెమ్మదిగా కోలుకుంటోంది. ఇలాంటి టైమ్ లో మరో దారుణం వెలగులోకి వచ్చింది. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. ఇప్పుడు వారి హత్య ఘటన బయటకు వచ్చింది. జూలైలో కనిపించకుండా పోయిన విద్యార్ధులు అల్లరిమూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలు హఠాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా విద్యార్ధులు ఇద్దరూ దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా నెట్ లో కనిపించింది. దీంతో మళ్ళీ ఈ మొత్తం వ్యవహారం దేశంలో దుమారం రేపుతోంది.
పూర్తిగా చదవండి..Manipur: మణిపూర్లో మరో దారుణం వెలుగులోకి…
మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

Translate this News:











