ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికీ, గ్రామ గ్రామానికి నాణ్యమైన ఆరోగ్యం అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Arogya Suraksha) పథకం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ వైద్యరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని (Health Minister vidudala Rajini) అన్నారు. ఐదు దశలలో ఈ పథకం ఉంటుందని మంత్రి తెలియజేశారు. గత నెల30న ప్రారంభించిన ఈ పథకంలో 10,574 క్యాంపులను రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు, ఇప్పటికే 1,235 క్యాంపులు నిర్వహించినట్లు 3 లక్షల 35 వేల ఓపీలు నమోదైనట్లు మంత్రి తెలిపారు. పాడేరు (paderu)లో 500 కోట్లతోనూ, కురుపాంలో 600 కోట్లతో మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయనీ.. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించ తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలలో, ఐదింటిని ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది పాడేరులో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నామన్నారు. మరో 300 పడకల ఆస్పత్రిని కూడా అభివృద్ధి చేస్తామనీ మంత్రి తెలిపారు.
పూర్తిగా చదవండి..Arakuloya: గిరిజనుల పాలిటి వరం “జగనన్న ఆరోగ్య సురక్ష: ఆరోగ్య మంత్రి విడుదల రజిని
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం గిరిజన ప్రాంతాల ప్రజల పాలిటి ఒక వరప్రదాయాని కాబోతున్నదని ఆంధ్రప్రదేశ్ వైద్యరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ఈరోజు అరకు లోయలో అన్నారు. గత నెల 30న ప్రారంభించిన కొత్త పథకం తీరుతెన్నులు పరిశీలించేందుకు ఆమె రెండు రోజులగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.

Translate this News:











