మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు ఎంపీ రఘురామకృష్ణ రాజు. చిరు కామెంట్స్ పైనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నేతలు చిరంజీవిపై మండిపడుతున్నారు. కాసేపటి క్రితమే చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కానీ.. సినిమా వాళ్ల గురించి మీకెందుకు అని బాగా గడ్డి పెట్టారని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వైసీపీ సర్కార్ కి బుద్ధి వచ్చేలా మాట్లాడారని.. చిరంజీవి మాటలు ప్రశంసనీయం అంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.
పూర్తిగా చదవండి..వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారు: ఎంపీ రఘురామ
వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కానీ.. సినిమా వాళ్ల గురించి మీకెందుకు అని బాగా గడ్డి పెట్టారని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వైసీపీ సర్కార్ కి బుద్ధి వచ్చేలా మాట్లాడారని.. చిరంజీవి మాటలు ప్రశంసనీయం అంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అలాగే పలు అంశాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు రఘురామ. వలంటీర్ల అరాచకాలు ఎక్కువయ్యాయని.. వలంటీర్లకు నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు.

Translate this News:











