అమెరికాలోని లూసియానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం పొగమంచు కారణంగా దాదాపు 158 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంటర్స్టేట్-55 అనే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. న్యూ ఓర్లానో దగ్గర్లోని పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో ఈ కార్లు, భారీ వాహనాలు కుప్పలుతెప్పలుగా పడి ఉండంటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పొగమంచు కమ్ముకోవడం వల్ల దాదాపు 30 నిమిషాల వరకు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ కారు ఏకంగా వంతెన పైనుంచి నీటిలో పడిపోయినట్లు చెప్పారు. అయితే ఈ ఘటననలో డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Accident: ఘోర ప్రమాదం.. రోడ్డుపై ఢీకొన్న 158 కార్లు..
అమెరికాలోని లూసియానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా దాదాపు 158 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పొగమంచు కమ్ముకోవడం వల్ల దాదాపు 30 నిమిషాల వరకు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ కారు ఏకంగా వంతెన పైనుంచి నీటిలో పడిపోయినట్లు చెప్పారు. కార్చిచ్చుల పొగ, అలాగే సాధారణ పొగమంచు కలిసి వాతావరణ పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది.

Translate this News:











