తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 55 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేతల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం 55 సీట్లలో బీసీలకు 12, జనరల్ 26, మైనారిటీ లకు 3 సీట్లు ఉన్నాయన్నారు. బీసీలకు తర్వాత జాబితాలో సైతం మంచి సంఖ్యలో సీట్లు లభిస్తాయన్నారు. కేసీఆర్ కంటే 4 సీట్లు ఎక్కువే బీసీలకు ఇస్తున్నామన్నారు. టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోరారు. తమ నాయకులందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. అందుకోసం అందరూ కలిసి పని చేయాలని పిలపునిచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా సరే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు. ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. డీఎస్సీ నియామకాలు లేక స్కూళ్లకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ సరిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు.
ఇది కూడ చదవండి: T-Congress First List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో 11 మంది బీసీలు.. లిస్ట్ ఇదే!
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ పై కోమటిరెడ్డి సంచలన రియాక్షన్.. జెండాలు మోసిన అందరికీ..
ఈ రోజు విడుదలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి లిస్ట్ పై ఆ పార్టీ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మొదటి లిస్ట్ లో బీసీలకు 12 సీట్లు దక్కాయన్నారు. నెక్ట్స్ లిస్ట్ లో మరిన్ని సీట్లు లభిస్తాయన్నారు. బీఆర్ఎస్ కన్నా తామే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు. టికెట్ రానివాళ్లంతా వచ్చిన వారితో పాటు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయన్నారు.

Translate this News:











