ఖమ్మంలో తుమ్మలకు బీఆర్ఎస్లో అధిష్టానం సీట్ విషయంలో షాక్ ఇవ్వడంతో ఆయన వర్గీయులు ఆందోళన చెందారు. ఏలాగైనా పాలేరులో పోటీ చేయాల్సిందేనని తన వర్గీయులు కోరారు. దీంతో బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గత వారం తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీకాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అయితే తమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దూకుడు పెంచారు. నేడు పలువు బీఆర్ఎస్ నేతలతో తుమ్మల భేటీ అయ్యారు.
పూర్తిగా చదవండి..Khammam: బీఆర్ఎస్కు భారీ షాక్.. తుమ్మల బాటలో పలువురు నేతలు
ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్లో తుమ్మల చేరడంతో ఖమ్మం రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. తుమ్మల పాలేరు టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్లో చేరగా.. అధిష్ఠానం నుంచి ఆయనకు హామీ వచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. దీంతో తుమ్మల అనుచరులు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Translate this News:











