హైదరాబాద్లో రెండవ రోజు ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్, అమీర్పేట్, కూకట్పల్లితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అమీర్పేట్లోని పూజ కృష్ణ చిట్ఫండ్స్పై ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సోంపల్లి నాగ రాజేశ్వరి పూజాలక్ష్మి ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్లపై రెండో రోజు(శుక్రవారం) కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. శంషాబాద్లోని చిట్ఫండ్ సంస్థ యజమాని రఘువీర్ ఇల్లు, ఆఫీసులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లిలోనూ హిందూ ఫార్చునాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో (శుక్రవారం) రెండవ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..IT Raids: హైదరాబాద్లో రెండోరోజు కొనసాగుతున్న ఐటీ తనిఖీలు
హైదరాబాద్లో రెండవ రోజు ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్, అమీర్పేట్, కూకట్పల్లితో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అమీర్పేట్లోని పూజ కృష్ణ చిట్ఫండ్స్పై ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

Translate this News:











