ISRO Chairman Somanath : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో కూడా ఇస్రో ఇదేవిధంగా ‘మార్స్’ (Mars)పైకి దిగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు ‘మా కళ్ళు ఇప్పుడు ‘మార్స్’ పైనే ఉన్నాయని సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయం తరతరాలుగా ఇస్రో నాయకత్వం, శాస్త్రవేత్తల కృషి ఫలితమన్నారు. కాగా ఆదిత్య ఎల్ 1 పేరుతో సన్ మిషన్ ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు.
పూర్తిగా చదవండి..ISRO: మీరు కన్న కలలే నిజం అవుతాయ్ చూడు..!!
చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు వేయబోతోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడాన్ని సెలబ్రెట్ చేసుకుంటూనే మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈసారి ఏకంగా సూర్యుడు, శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపై పరిశోధలను జరుపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు.

Translate this News:











