మాల్దీవులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మాల్దీవులు ఒకటి. చాలామంది టూరిస్టులు ఇక్కడి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా మాల్దీవులకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం వెంటనే మాల్దీదువులను వీడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికోసం భారత్తో చర్చలు ప్రారంభించామని తెలిపారు. వాస్తవానికి మాల్దీవుల్లో ఇండియన్ ఆర్మీ ఉనికికి వ్యతిరేకంగా మొహమ్మద్ మయిజ్జు పార్టీ ప్రచారం చేసి గెలిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం ఈ విషయంపై మాట్లాడారు. తమ దేశం నుంచి భారత సైన్యం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
పూర్తిగా చదవండి..Indian Army: భారత సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి: మాల్దీవులు అధ్యక్షుడు
మాల్దీవులకు ఇటీవల మొహమ్మద్ మయిజ్జు అనే నేత నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఈ విషయంపై భారత్తో చర్చలు ప్రారంభించామని పేర్కొన్నారు.

Translate this News:











