CM KCR Flag Hoist at Golconda Kota: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలోని రాణిమహల్ లాన్స్లో సీఎం కేసీఆర్ ఇవాళ (ఆగస్టు 15) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సమన్వయంతో పని చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల వారీగా ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లపై ఆమె కూలంకషంగా చర్చించారు.
పూర్తిగా చదవండి..Independence day: పంద్రాగస్టు పండుగ.. కేసీఆర్ చేతుల మీదుగా పోలీసు అధికారులకు అవార్డులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టింది. ఇక కేసీఆర్ చేతుల మీదుగా ఇటివలి వరద సమయంలో అంకీతభావంతో పనిచేసిన పోలీసులకు అవార్డులు ఇవ్వనున్నారు.

Translate this News:











