కోహ్లీ(Virat Kohli) అంటే కింగ్ ఆఫ్ క్రికెట్ మాత్రమే కాదు.. కింగ్ ఆఫ్ హార్ట్స్ కూడా. తన ఆటతో యావత్ క్రికెట్ ప్రపంచం మనసులను గెలుచుకున్న ఈ జనరేషన్ లెజెండ్ కోహ్లీ. అయితే కేవలం కోహ్లీ ఆటనే కాదు.. అతని మనసు కూడా చాలా గొప్పది. ఎన్నో సేవ కార్యక్రమాల్లో పాల్గొనే కోహ్లీ బయట ఎప్పుడూ ఆ విషయాలు చెప్పుకోడు. ఇక అభిమానులను కూడా ఎప్పుడూ బాధపెట్టడు. తన కోసం ఏ అభిమాని అయినా దూరం నుంచి చూస్తు నిలపడి ఉంటే అతడిని పిలిచి మరి సెల్ఫీ దిగే మంచి తత్వం కోహ్లీది. అటు ప్రత్యర్థి ఆటగాళ్ల విషయంలోనూ కోహ్లీ రూటు సపరేటు. తనకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాడు. నచ్చకపోతే కయ్యానికి దిగుతాడు. ఇక సమకాలీన క్రికెట్లో కోహ్లీకి పోటి ఉన్న బ్యాటర్లలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్(Babar Azam) ఒకడు. నిన్న ఇండియా-పాకిస్థాన్ మధ్య వరల్డ్కప్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ చేసిన ఓ పని అందరిని కట్టిపడేసింది.
పూర్తిగా చదవండి..IND vs PAK: కోహ్లీ చేసిన ఈ పని పాకిస్థాన్ ప్రజల హృదయాలను హత్తుకుంది.. వైరల్ వీడియో..!
భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు ముగిసిన తర్వాత బాబర్ అజామ్కు విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీను ఇచ్చాడు. తన అంకూల్ కొడుకు కోహ్లీ టీషర్ట్ కావాలని అడిగాడని బాబర్ చెప్పాడు. దీంతో కోహ్లీ వెంటనే తన టీషర్ట్ను బాబర్కు ఇచ్చేశాడు. సమకాలీన క్రికెటర్లు ఈ ఇద్దరి మధ్య గట్టి పోటి ఉండగా.. బాబర్ అందరి ముందు కోహ్లీ దగ్గర టీషర్ట్ తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కోహ్లీ చేసిన పని పాక్ అభిమానులకు ఎంతగానో నచ్చిందట!

Translate this News:











