స్పీడ్ కిల్స్ ..! రోడ్డుపై కొందరు రయ్ రయ్ అని దూసుకుపోతారు. ఓవర్ స్పీడ్తో రోడ్డుపై ఇతర వాహనదారులను ఇబ్బంది పెడతారు. ఇలాంటి వారి వల్ల నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కొన్నిసార్లు స్పీడ్గా వెళ్లిన వారే యాక్సిడెంట్లో మరణిస్తుంటారు. ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం వల్ల ఏదోక అనర్థం జరగకమానదు. అందుకే స్లో అండ్ స్టడి విన్స్ ది రేస్ అని చెబుతుంటారు. అయితే కొంతమందికి ఇవేవి చెవికి ఎక్కవు. వేగంగా వెళ్లిన వారి ప్రాణాలు పోతున్నా.. ఇతరుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నా.. ఈ ఓవర్స్పీడ్ మైండ్సెట్ వాహనదారులు మారరు. ఇలాంటివారిపై పోలీస్శాఖ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. అటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తుంటారు. మరోసారి అదే చేశారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో సూర్యకుమార్ రనౌట్ని ఓవర్ స్పీడ్తో కంపేర్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. అద కాస్త వైరల్గా మారింది.
పూర్తిగా చదవండి..Sajjanar: విరాట్ కోహ్లీ-సూర్యకుమార్ యాదవ్ రనౌట్ సీన్పై సజ్జనార్ ట్వీట్ వైరల్!
'రోడ్లపై అతివేగం యమ డేంజర్! వెనుక ముందు చూసుకోకుండా ఇలా రయ్యిన దూసుకుపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి.' అంటూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. న్యూజిలాండ్పై మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ రనౌట్ని అతివేగంతో పోల్చుతూ ఈ ట్వీట్ చేశారు సజ్జనార్.

Translate this News:











