స్టేడియంలో ఛైర్స్పై కాకి రెట్టలు.. ఎంప్టీ గ్యాలరీలు.. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు.. ఇవేం సరిపోదుంటూ కొత్తగా గ్రౌండ్ నిర్వాహణలోనే బీసీసీఐపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధర్మశాల అవుట్ఫీల్డ్ చూసిన ఏ క్రికెటర్కైనా.. క్రికెట్ అభిమానికైనా కోపం రాక మానదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల సేఫ్టీకి ఇదేనా మీరు ఇచ్చే ప్రాధాన్యం అని బీసీసీఐని ఫ్యాన్స్తో పాటు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos buttler) సైతం ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి అవుట్ఫీల్డ్లో బంతిని ఆపే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నాడు. ఆటగాళ్లు గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు బట్లర్. రేపు(అక్టోబర్ 10) ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్(England vs Bangladesh) మ్యాచ్ ధర్మశాలలోనే జరగనుండగా.. బట్లర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించికున్నాయి. పరోక్షంగా బీసీసీఐకి చురకలు అంటించే విధంగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..World cup 2023: ఆ గ్రౌండ్లో డైవ్ చేస్తే మీ పని గోవిందా.. ఇదేం దరిద్రం భయ్యా.. కెప్టెన్ ఫైర్..!
వరల్డ్కప్ నిర్వాహణ విషయంలో బీసీసీఐపై నానాటికి విమర్శలు పెరుగుతున్నాయి. ధర్మశాల అవుట్ఫీల్డ్పై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ గ్రౌండ్లో ఫీల్డింగ్ చేసే సమయంలో ఇంగ్లండ్తో పాటు మిగిలిన జట్టు ఆటగాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అఫ్ఘాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో బాల్ కోసం ముజీబ్ డైవ్ చేయగా ఏకంగా గ్రౌండ్లో ఇసుక లేచి వచ్చింది. అటు ఐసీసీ(ICC) ప్రతినిధి అవుట్ఫీల్డ్ 'రేటింగ్ యావరేజ్' అని చెప్పాడు.

Translate this News:











