రేపు(అక్టోబర్ 8) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs australia) మధ్య జరగనున్న ఫైట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 2023 వరల్డ్కప్లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఇండియాలో క్రికెట్ ఫీవర్ ఓ రేంజ్కి వెళ్లే టైమ్ దగ్గర పడిందనే చెప్పాలి. రేపు చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అందులోనూ రేపు ఆదివారం కావడంతో మధ్యాహ్నం బిర్యానీ తినేసీ టీవీలు ఆన్ చేసే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. ఇరు జట్లు బలాబలాల విషయంలో ఎవరికీ తక్కువ కానప్పటికీ ఇండియానే గెలుస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే వర్షం కారణంగా రెండు వార్మప్ మ్యాచ్లను కూడా టీమిండియా ఆడకపోవడం కాస్త ప్రతికూల అంశం.
పూర్తిగా చదవండి..Ind Vs Aus: ఆ తోపు లేకుండానే బరిలోకి టీమిండియా.. అయినా ఆస్ట్రేలియాకు బడితపూజే..!
ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుండగా యువ ఓపెనర్ గిల్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండడం లేదు. డెంగీ బారిన పడ్డ గిల్ స్థానంలో ఇషాన్ కిషాన్ తుది జట్టులో ఆడనుండగా.. ముగ్గురు స్పిన్నర్లు(అశ్విన్, జడేజా, కుల్దీప్)తో రోహిత్ సేన బరిలోకి దిగనుంది.

Translate this News:











