భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇండియాకు కెనడాతో ఉన్న సంబంధాలు దాదాపుగా తెగిపోతున్నాయి. కెనడా ప్రధాని ట్రుడో ఖలిస్థాన్ ఉగ్రవాది విషయంలో చేసిన ఆరోపణలను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని హిందువులంతా ఇండియాకు వెళ్ళిపోవాలని ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వార్నింగ్ ను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకే అమృత్ సర్ జిల్లా ఖాన్ కోట్ లో ఉన్న అతని వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్ లో ఉన్న ఇల్లును ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇక మీదట అవి ప్రభుత్వానివి అని ప్రకటించింది.
పూర్తిగా చదవండి..khalisthan:భారత్ తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదు…
ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఛీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియాలో అతని ఆస్తులను జప్తు చేసింది.

Translate this News:












