Haryana: నుహ్ అల్లర్లు హర్యానా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మళ్లీ విద్వేష ప్రసంగాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. షరతులతో కూడిన పోలీసుల అనుమితితో నిర్వహించిన గోరక్షక్ దళ్ సభలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ సంఘ నాయకుడు ఆచార్య ఆజాద్ శాస్త్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. తమకు 100 లైసెన్స్ ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..‘అయితే కొట్టండి.. లేదంటే చావండి’: గోరక్షక్ దళ్
కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న హర్యానాలో మళ్లీ విద్వేష ప్రసంగాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. నూహ్ అల్లర్లు తర్వాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు సున్నితంగా మారిపోయాయి. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలుచేస్తున్నారు.

Translate this News:











